ప్రకాశం: వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం జోనల్ సెక్రటరీగా దర్శికి చెందిన దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామక జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి జగన్కు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.