NLR: కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం జాతీయ రహదారిపై బ్రహ్మయ్య కాలేజి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. గాయపడిన వ్యక్తి నార్త్ రాజుపాలెంకు చెందిన సుబ్బారెడ్డిగా గుర్తించిన స్థానికులు 108 వాహనంలో నెల్లూరుకు తరలించారు.