ప్రకాశం: కనిగిరి పట్టణంలో వాగులు, వంకలను సైతం ఆక్రమించి కొందరు అక్రమంగా వెంచర్లు, కట్టడాలు నిర్మించారనే ఫిర్యాదులతో శనివారం రెవెన్యూ యంత్రాంగం కదిలింది. తహసిల్దార్ రవిశంకర్ ఆధ్వర్యంలో పది బృందాలు పట్టణంలోని ఆక్రమణలపై సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ భూములను, వాగులు కబ్జా చేసినట్లు తెలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హెచ్చరించారు.