SRD: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 5వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. సమస్యలు అక్కడికి అక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.