VSP: గాజువాక డిపో వద్ద మున్సిపల్ వాటర్ ట్యాంక్లో పడి ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి మతిస్థిమితం లేకుండా తిరుగుతుంటాడు. శనివారం మధ్యాహ్నం వాటర్ ట్యాంక్ లోపలికి దిగడంతో నీటిలో మునిగిపోయాడు. పరిసరప్రాంత ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసుల సాయంతో బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.