TG: ఇవాళ హన్మకొండలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా దేవన్నపేట పంప్హౌస్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం పంప్హౌస్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా.. ఈ పంప్హౌస్ను మంత్రులు ఉత్తమ్, పొంగులేటి 2 నెలల కిందట ప్రారంభించారు. దీనిద్వారా ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించనున్నారు.