PLD: నరసరావుపేటలోని ఎస్ఆర్కేటీ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పాత మాగులూరుకి చెందిన గోపి బుక్కాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎస్ఆర్కేటీ కాలనీ వద్ద వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గోపి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోను వదిలి డ్రైవర్ పరారయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.