KDP: ఆంధ్ర భద్రాద్రిగా వెలసిన ఒంటిమిట్ట కోదండ రామాలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు, సిబ్బంది శ్రీవారి సేవకులు, శుక్రవారం లెక్కించారు. గత నెల 21 నుంచి నిన్నటి వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 27, 69,135 ఆదాయం వచ్చిందని ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. గత 9 ఏళ్ల తర్వాత అత్యధిక హుండీ ఆదాయం వచ్చిందన్నారు.