KDP: ప్రధాని నరేంద్ర మోదీ కడప ఉక్కు ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం కడపలోని అంబేద్కర్ సర్కిల్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ ఎంతో అవసరం అన్నారు. ఇక్కడ యువత ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.