• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ధర్నాకు వెళ్తున్న ఆశ వర్కర్ల ముందస్తు అరెస్టు

NLG: సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న ఆశ కార్యకర్తలను మంగళవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ కానుగు లింగస్వామి, ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 18 వేలను అందించాలన్నారు.

December 10, 2024 / 08:36 PM IST

ఇంకా 30 రోజులే.. ‘గేమ్ ఛేంజర్’ పోస్టర్ రిలీజ్

హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ 30 రోజుల్లో థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ రామ్ చరణ్ పోస్టర్‌ను విడుదల చేశారు. మెగా మాస్ మేనియా వచ్చేస్తుంది. థియేటర్స్‌లో కలుద్దాం అనే క్యాప్షన్ జత చేశారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

December 10, 2024 / 08:35 PM IST

‘అల్లికలకు మరింత ప్రఖ్యాత దిశగా చర్యలు’

W.G: లేస్‌కు మరింత వన్నె తెచ్చేదిశగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు కలెక్టర్‌ను న్యూఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందం ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.విశ్వ ఆధ్వర్యంలో కలుసుకుని లేస్ ఉత్పత్తులపై చర్చించారు.

December 10, 2024 / 08:35 PM IST

సమస్యలను పరిష్కరించాలంటూ మంత్రిని కోరిన ఛైర్మన్

VSP: విశాఖలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణిని మంగళవారం జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గిరిజన ప్రాంత సమస్యలను మంత్రి దృష్టికి తీసువచ్చారు. గిరిజన గురుకులల్లో ఔట్‌సోర్స్‌లో పనిచేస్తున్న తమను సీఆర్టీలుగా మార్చండంటూ గత 4 వారాలుగా నిరవధిక దీక్ష చేస్తున్న వారి సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరారు.

December 10, 2024 / 08:34 PM IST

ఈనెల 14న దొడ్డి కొమురయ్య భవనం ప్రారంభం

HYD: ఈనెల 14న నార్సింగి పరిధి కోకాపేట్ వద్ద దొడ్డి కొమురయ్య కురమ సంఘ ఆత్మ గౌరవ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు తెలిపారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను డా.బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

December 10, 2024 / 08:32 PM IST

ఒమ్మిలో పురిళ్లు దగ్ధం

VZM: నెల్లిమర్ల మండలంలోని ఒమ్మి గ్రామంలో మంగళవారం వేకువజామున పురిళ్లు దగ్ధమైంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాడుగుల గురువులు అనే వృద్ధుడు ఒంటరిగా పురి పాకలో నివాసం ఉంటున్నాడు. వేకువజామున ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇంట్లో నిద్రిస్తున్న గురువులు తేరుకొని తప్పించుకొని బయటకి వచ్చాడు.

December 10, 2024 / 08:30 PM IST

జనసేన కార్యకర్తల ఆత్మీయ కలయిక

VZM: విజయనగరం మండలంలోని 22 గ్రామ పంచాయితీలకు చెందిన జనసైనికులు మంగళవారం రామనారాయణం సమీపంలోని తోటలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధులుగా నెల్లిమర్ల శాసన సభ్యులు లోకం నాగమాధవి, జనసేన నాయకులు లోకం ప్రసాద్, అవనాపు విక్రమ్, భావన దంపతులు హాజరై దిశానిర్ధేశం చేశారు. ప్రతీ పల్లె, ప్రతీ గ్రామంలో జనసేన జెండా ఎగరాలన్నారు.

December 10, 2024 / 08:30 PM IST

ఘనంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

NLG: ఎంజీ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి హాజరై మాట్లాడుతూ.. జాతీయ సేవా పథకం వాలంటీర్స్ హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి, వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.

December 10, 2024 / 08:30 PM IST

విద్యుత్ షాక్‌తో ఆవు మృతి

BHPL: మహాదేవపూర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మేసినేని రవీందర్ రావు, కోరిపల్లి కిషన్ రావుకు చెందిన ఆవు కరెంట్ షాక్‌తో మృతి చెందాయి. మండలంలోని డబల్ బెడ్రూమ్ కాలనీలో ఉన్న 33 కెవిలైన్ ట్రాన్స్‌ఫార్మర్ వైయర్లు తగిలి కరెంట్ షాక్‌తో మృతి చెందుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆవు విలువ రూ.1,50,000 ఉంటుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

December 10, 2024 / 08:29 PM IST

నీటి సంఘాల ఎన్నికలపై ఎమ్మెల్యే సమీక్ష

SKLM: నీటి సంఘాల ఎన్నికలపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఐదు మండలాలకు సంబంధించి మైనర్ నీటి సంఘాల రైతులతో సాగు నీటి సంఘాలు ఎన్నికలు, నోటిఫికేషన్ నిర్వహణ,పై సమీపించారు. గత ప్రభుత్వం చాకు నీటి సరఫరా వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు.

December 10, 2024 / 08:27 PM IST

మనోజ్‌ నిన్నే గారాబంగా పెంచా: మోహన్‌బాబు

TG: జల్‌పల్లిలో మోహన్‌బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ఘటనపై మోహన్‌బాబు స్పందించారు. ‘మనోజ్ నువ్వు నా బిడ్డవు. నిన్ను ఎలా పెంచానురా నేను.. అందరికంటే నిన్నే గారాభంగా పెంచాను. నువ్వు ఏది అడిగినా నీకిచ్చాను. కానీ నువ్వు ఈరోజు చేస్తున్న పని.. బిడ్డలు గుండెల మీద తంతారంటారే.. అలా తన్నావురా. నా మనసు ఆవేదనతో కృంగిపోతుంది. నేను మీ అమ్మ ఏడుస్తున్నామ్. మీ అమ్మ ఎంతో కుమిలిపోత...

December 10, 2024 / 08:27 PM IST

సజ్జల బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP: వైసీపీ నేత సజ్జల రామ కృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. సజ్జలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది.

December 10, 2024 / 08:26 PM IST

ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

ASR: సూపర్ సిక్స్‌ను వెంటనే అమలు చేయాలని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6నెలలు అవుతుందన్నారు. ఇప్పటి వరకూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతులకు రూ.20వేలు ఇస్తామని చెప్పిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు.

December 10, 2024 / 08:23 PM IST

‘ప్రభుత్వం హామీలను అమలు చేయాలి’

కామారెడ్డి: బాన్సువాడ ఉద్యమకారులకు ప్రకటించిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని బాన్సువాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. పట్టణంలోని స్థానిక ఆర్అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆగ్రో చైర్మన్ మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ ఉన్నారు.

December 10, 2024 / 08:23 PM IST

ఆర్టీసీ ఎండిని కలిసిన ఆర్టీసీ జోనల్ ఛైర్మన్

NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ, ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావును మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడలోని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసులో నెల్లూరు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎండి తిరుమలరావుని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ సమస్యలు, తదితర విషయాలను చర్చించడం జరిగిందన్నారు.

December 10, 2024 / 08:22 PM IST