NLG: సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న ఆశ కార్యకర్తలను మంగళవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ కానుగు లింగస్వామి, ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 18 వేలను అందించాలన్నారు.