VSP: విశాఖలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణిని మంగళవారం జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గిరిజన ప్రాంత సమస్యలను మంత్రి దృష్టికి తీసువచ్చారు. గిరిజన గురుకులల్లో ఔట్సోర్స్లో పనిచేస్తున్న తమను సీఆర్టీలుగా మార్చండంటూ గత 4 వారాలుగా నిరవధిక దీక్ష చేస్తున్న వారి సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరారు.