PPM: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పార్వతిపురం పాత బస్టాండ్ ఆవరణలో మానవ హక్కుల దినోత్సవంను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమే ఈ అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యమన్నారు. అనంతరం స్థానికులకు ఆహారపొట్లాలు పంచారు.