ELR: భీమడోలు మండలం గుండుగొలను వద్ద గోదావరి కాలువపై నిర్మిస్తున్న వంతెన పనులను మంగళవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పరిశీలించారు. ఈ మేరకు కాలువలో పేరుకుని ఉన్న గుర్రపుడెక్కను వెంటనే తొలగించి రైతులకు దాళ్వా పంటకు సాగునీటికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూడాలని, ఇరిగేషన్ అధికారులుతో మాట్లాడారు. వంతెన పనులు గురించి స్థానిక కూటమి నాయకులతో చర్చించారు.