NLR: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్ర బాబుకు మంత్రివర్గంలో చోటు దక్కడంతో బుచ్చి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మాధవరావు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి నాగేంద్ర బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీని కష్టకాలంలో అండగా నిలిచారని ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కడం హర్షనీయమన్నారు.