AP: మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులోని ప్రయాణికులు చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యసేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తెలిపారు.