TG: నేపాల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో పలువురు తెలంగాణ వాసులు అక్కడ చిక్కుకున్నారు. వారికి సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ముగ్గురు అధికారుల బృందానికి బాధ్యతలు అప్పగించింది. కాగా, సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్లో ప్రజలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారితీసిన విషయం తెలిసిందే.