AP: నేపాల్లో చిక్కుకున్న తెలుగువారికి వీడియోకాల్ చేసి మంత్రి లోకేష్ మాట్లాడారు. నేపాల్లో మొత్తం 187 మంది తెలుగు వారు చిక్కుకుంటే అందులో విశాఖకు చెందిన 81 మంది ఖాట్మండులోని హోటల్లో తలదాచుకున్నారు. విశాఖకు చెందిన రాజారాణితో లోకేష్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారిని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత తనదని భరోసా కల్పించారు.