RR: షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చించోడు, అయ్యవారిపల్లి గ్రామస్తులు తహసీల్దార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని వ్యవసాయ పొలాల మీదుగా నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు మార్కింగ్ను మార్చాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. పలువురు మాట్లాడుతూ.. వ్యవసాయ పొలాల మీదుగా రహదారి నిర్మాణం చేపట్టాలని సర్వేనెంబర్లను ఎంపిక చేయడం సరికాదన్నారు.