అన్నమయ్య: కలకడ మండలం కొత్తపల్లిలో గట్టు వెంకటరమణ, ప్రసాద్ రెడ్డి కుటుంబాల మధ్య కొంతకాలంగా భూ విషయమై తగాదాల నడుస్తున్నాయి. ఈ విషయమై గట్టు వెంకటరమణ కుమారుడు ప్రవీణ్, ప్రసాద్ రెడ్డి ఘర్షణ పడ్డారు. ఇందులో ప్రవీణ్ (25)కి తీవ్ర గాయలయ్యాయి. అతడిని బంధువులు వాయల్పాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న కలకడ సీఐ లక్ష్మన్న కేసు నమోదు చేశారు.