TG: సీఎం రేవంత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూకుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బాలానగర్లో 9 వేల 300 ఎకరాల భూ కుంభకోణం.. ఎకరానికి 40 కోట్లు వేసుకున్నా 4 లక్షల కోట్లు దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. జపాన్లో ఉన్నప్పుడు కూడా ఈ భూమికి సంబంధించిన ఫైల్పై రేవంత్ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.