AP: మొంథా తుఫాను గమనం తీరం దాటే విషయంలో మార్పు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాకినాడ సమీపంలోనే తీరం దాటవచ్చని.. లేకపోతే తుని సమీపం లేదా నరసాపురం వైపు కొద్దిగా దిశ మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తమిళనాడులో వర్షాలు తగ్గి.. ఒంగోలు నుంచి శ్రీకాకుళం వరకు నెమ్మదిగా వర్షాలు పెరుగుతాయని పేర్కొంది.