AP: మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సు, టిప్పర్ రెండూ రాంగ్ రూట్లో ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని, టిప్పర్ డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని చెప్పారు. బస్సు డ్రైవర్ చెప్పిన స్టీరింగ్ స్ట్రక్ విషయంపై పూర్తి స్థాయిలో విశ్లేషిస్తామన్నారు.