AP: విశాఖ సీతంపేటలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గంజి పడి ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. చిన్నారులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 20 మందికి గాయాలు కాగా, వారిలో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు కలెక్టర్ తెలిపారు.