AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దర్శనాలపై మండలి ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్గగుడి దర్శనాల్లో ఎమ్మెల్సీలకు ప్రత్యేక అవకాశం కల్పించాలని తెలిపారు. MLCలు ఫోన్ చేస్తే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాను ఫోన్ చేసినా దుర్గగుడి అధికారులు స్పందించడం లేదన్నారు. MLCలు, బంధువులకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, MLCలకు ప్రత్యేక సమయం కేటాయించినట్లు మంత్రులు తెలిపారు.