వారణాసిలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లలో హోలీ సంబరాలు భిన్నంగా జరుగుతాయి. ఇక్కడ రంగులకు బదులుగా చితి నుంచి సేకరించిన బూడిదను ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. మశాన హోలీగా పిలిచే ఈ వేడుకలో భక్తులు శివనామాలు జపిస్తూ, డోళ్లు వాయిస్తూ ఘాట్ల గుండా ఊరేగింపుగా వెళ్తారు. మరణాన్ని కూడా సంబరంగా మార్చే ఈ అరుదైన సాంప్రదాయాన్ని చూడటానికి భక్తులు, పర్యాటకులు భారీగా తరలివస్తారు.