TG: శంషాబాద్లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. స్కైరూట్ బృందానికి అభినందనలు. అంతరిక్షంలో ఇది ఒక గొప్ప మైలురాయి. భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుంది’ అని ఆకాంక్షించారు.