AP: మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. తమను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ BNS 132, 126(2), 351(3), 189(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. అనుమతులు లేకుండా భారీ ప్రదర్శన నిర్వహించి ప్రజలకు, ట్రాఫిక్కు ఆటంకం కలిగించారని తెలిపారు.