ఎండాకాలంలో వచ్చే జలుబుకు ముఖ్య కారణం ఎంటెరో వైరస్. ఎండ నుంచి రాగానే ఒక్కసారిగా చల్లటి ఏసీ గదుల్లోకి వెళ్లడం, కూల్ వాటర్ తాగడం వల్ల ఈ సమస్య వస్తుంది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగి గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే ఎండ నుంచి రాగానే నార్మల్ వాటర్ తాగడం ఉత్తమం. శరీరం డీహైడ్రేట్ కాకుండా కొబ్బరినీళ్లు, నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి మంచిది.