TG: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు ఎన్నికల సంఘం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. MPTC, ZPTC ఎన్నికలకు ఫ్రీ సింబల్స్ను ప్రకటిస్తూ.. జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఈనెల 10వ తేదీ వరకు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. 15వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేయాలని పేర్కొంది.