కార్మిక చట్టాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ను నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ మార్పు ద్వారా కార్మికుల సంక్షేమం మెరుగవుతుందని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ అభిప్రాయపడ్డారు.