TG: దేశంలో, రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. కాంగ్రెస్, BJP కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీజేపీది కేవలం దుష్ప్రచారం మాత్రమే అని పేర్కొన్నారు. BRS గానీ, KCR గానీ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ కట్టినా గొప్ప పురస్కారం దక్కేది అన్నారు.