AP: వచ్చే నెల 16న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. అనంతరం శ్రీశైలం మల్లికార్జునస్వామిని మోదీ దర్శించుకోనున్నారు. కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతలు రోడ్ షోలో పాల్గొంటారు. జీఎస్టీ సంస్కరణలపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.