మేఘాలయాలో తన భర్త రాజా రఘువంశీ హత్యకు గురైన కేసులో సోనమ్, ఆమె ప్రియుడు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త హత్య తర్వాత ఇండోర్లోని అద్దె గదిలో సోనమ్ తన ప్రియుడిని కలిసినట్లు పోలీసులు తెలిపారు. మే 25-27 మధ్య ఆమె దేవాస్ గేట్లోని అద్దె గదిలో దిగిందని వెల్లడించారు. హత్య చేసిన విధానాన్ని తెలుసుకునేందుకు సీన్ రీక్రియెట్ చేస్తామని చెప్పారు.