TG: మాజీ మంత్రి హరీష్ రావుపై ఆరోపణలు చేస్తే బీజేపీ నేతలు ఎందుకు స్పందిస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ‘ఉద్యమ సమయంలో చాలా మందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. నాపై ఆరోపణలు చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, టీ న్యూస్కు లీగల్ నోటీసులు పంపుతా. నా భర్త ఫొటో చూపిస్తూ ఏలేటి ఎందుకు మాట్లాడుతున్నారు. వారి బెదిరింపులకు భయపడను’ అని అన్నారు.