ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్లో హిమపాతం కురుస్తుంది. పుల్వామా, షోపియాన్లో మైనస్ 5.2 డిగ్రీలు, శ్రీనగర్, కుప్వారాలో మైనస్ 3.6 డిగ్రీలు, కాజిగుండ్లో 2.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్కు వాతావరణశాఖ అధికారులు కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేశారు.