సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా(CJI) జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2027 FEB 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. CJIగా బాధ్యతలు చేపడుతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.