TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి సన్నాహక సమావేశం నిర్వహించారు. రాబోయే 90 రోజుల అభివృద్ధి ప్రణాళికను అధికార యంత్రాంగం పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పొంగులేటి తెలిపారు.