TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 5వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 12,641 ఓట్లు రాగా.. 3,178 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి లక్ష్మీదేవి పూజలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా గాంధీభవన్లో సంబురాలు మొదలయ్యాయి.