TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2023 నవంబర్ 15న 600 మంది ఫోన్లను ప్రభాకర్ టీమ్ ట్యాప్ చేసినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో ట్యాపింగ్ చేశారు. రివ్యూ కమిటీకి సానుభూతిపరులంటూ ప్రభాకర్ నేతల నెంబర్లు ఇచ్చారు. అధికార, ప్రతిపక్ష నేతలు, వ్యాపారులతో పాటు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది.