పార్శ్వోత్తనాసనం అనేది నిలబడి చేసే యోగాసనం. కాళ్లను, వెన్నెముకను బలోపేతం చేసి, శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. తొడల వెనుక ఉండే హామ్స్ట్రింగ్స్, పిక్కలు, తుంటి కండరాలను సాగదీస్తుంది. పొత్తికడుపు భాగంపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. శరీరాన్ని బ్యాలెన్స్ చేసే సమయంలో దృష్టి కేంద్రీకరించడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గి మానసిక స్పష్టత పెరుగుతుంది.