అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా యూపీ సీఎం ఆదిత్యనాథ్ దేశంలో నిలిచారు. దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలితప్రాంతాల సీఎంల పనితీరుపై ‘ఇండియా టుడే’ సర్వే నిర్వహించింది. దాంట్లో 36% ఆదరణతో ఆయన తొలి స్థానంలో ఉన్నారు. 13%తో బెంగాల్ సీఎం మమత రెండో స్థానంలో, 7%తో ఏపీ సీఎం చంద్రబాబు మూడో స్థానంలో ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 2.1% ఆదరణ లభించింది.