TG: పాశమైలారం ఘటనలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది పాశమైలారంలో ఇది మూడో ఘటన. దీనికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం. ఇప్పటివరకు కంట్రోల్ రూమ్ కూడా పెట్టలేదు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.50లక్షల పరిహారమివ్వాలి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.