ఢిల్లీలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భజన్పురా ప్రాంతంలో ఒ మహిళను ఆమె భర్త, అతని అన్నయ్య కలిసి దారుణంగా కొట్టారు. పదునైన ఆయుధంతో భార్య ముఖం, శరీరంపై అనేక చోట్ల దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మహిళను ఆస్పత్రిలో చేర్చారు. చికిత్సలో భాగంగా ఆమె ముఖంపై 250 కుట్లు వేసినట్లు తెలిపారు. ఆ మహిళ చెంప, నుదురు, చెవిపై కుట్లు వేశారు.