ఛత్తీస్గఢ్ బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య ఏడుకు చేరింది. వీరితో పాటు మరో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఇంకా భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.