రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ఇవాళ సా.5 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారు. అనంతరం పికెట్ పార్క్లో వాజ్పేయ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.