AP: అటవీశాఖ అధికారులు పీపుల్ ఫ్రెండ్లీగా మారాలని సీఎం చంద్రబాబు సూచించారు. అటవీశాఖ అధికారుల వల్ల ఏర్పడ్డ ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలన్నారు. ఈసారి అటవీశాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. దీనిపై డిప్యూటీ సీఎంతో మాట్లాడానని.. మరోసారి మాట్లాడతానని తెలిపారు.