AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో మంత్రి లోకేష్ పర్యటించారు. బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.2,300 కోట్ల పెట్టుబడితో దశల వారీగా బ్లూజెట్ హెల్త్కేర్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రీయల్ పార్క్లో యూనిట్ ఏర్పాటు చేయనున్నారు.