ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రేపు పశ్చిమాసియాలో నిర్వహించాల్సిన 12వ తరగతి పరీక్షను రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ భరద్వాజ్ తెలిపారు. పరిస్థితిని బట్టి రానున్న పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు.