హైదరాబాద్లో మెస్సీ టూర్ ఫ్యాన్స్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. టూర్ మొత్తం కమర్షియల్గా సాగిందని, మెస్సీ కనీసం జెర్సీ కూడా వేసుకోకుండా అంటీముట్టనట్టు వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తాయి. ఇక నిర్వాహకురాలు పార్వతీ రెడ్డి ఓవరాక్షన్, ఫొటోకు రూ.10 లక్షలు వసూలు చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ వసూళ్ల దందాపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.